అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టరేట్లో (Collectorate) సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 112 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావులకు వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.