ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై రామకృష్ణ(SI Ramakrishna) తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలంలోని మైలారం(Mylaram) శివారులో పాయిలకుంట చెరువు కట్టపై గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

    దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని చెప్పారు. అనంతరం గ్రామంలో సీసీ ఫుటేజ్​ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు మధ్యలో యువకుడిని తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​ మార్చురీకి తరలించినట్లు తెలిపారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...