ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | గడ్డి కోస్తుండగా తెగిన విద్యుత్​ వైర్లు.. కరెంట్​ షాక్​తో రైతు మృతి

    Bheemgal | గడ్డి కోస్తుండగా తెగిన విద్యుత్​ వైర్లు.. కరెంట్​ షాక్​తో రైతు మృతి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | పొలంలో గడ్డి కోస్తుండగా (Grass) విద్యుత్​ తీగలు తెగి కరెంట్​ షాక్​తో రైతు మృతి చెందిన ఘటన భీమ్​గల్​ మండలంలో చోటు చేసుకుంది. భీమ్​గల్​ ఎస్సై సందీప్​ (Sub Inspector Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. ​మండలంలోని రహత్ నగర్ (Rahath Nagar) గ్రామానికి చెందిన రైతు ధరావత్ రామ్ సింగ్(50) రోజూ మాదిరిగానే శుక్రవారం తన పొలంలో పనులు చేసేందుకు వెళ్లాడు.

    కాగా.. పొలంలో ఒడ్డు వెంట గడ్డి కోసే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్​ తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పక్కనే పొలం దున్నుతున్న మరో రైతు గమనించి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి (Armoor Government Hospital) తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తమ ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...