అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని ఓ ఆపార్ట్మెంట్లో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ రోడ్లోని (Armoor Road) పృథ్వి ఆపార్ట్మెంట్లో (Prithvi apartment) ఓ ప్లాట్లో నివాసముండే మహిళ ఇటీవల హైదరాబాద్కు (Hyderabad) వెళ్లింది. ఆమె తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉండడంతో చోరీ జరిగినట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.20,000 నగదు.. 8 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
Nizamabad City | అపార్ట్మెంట్లలో కరువైన భద్రత..
నగరంలోని అపార్ట్మెంట్లలో భద్రత ఉంటుంది. సీసీ కెమెరాలు..(CCTV cameras) నైట్ వాచ్మెన్.. ఇలా 24 గంటల పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ దుండగులు అపార్ట్మెంట్లలోని ప్లాట్లలోకి చొరబడి చోరీలు చేస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.