STU Nizamabad
STU Nizamabad | పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి

అక్షరటుడే, ఇందూరు: STU Nizamabad | గతేడాది జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ(PRC)ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్(STU District President Secretaries Dharmender), శ్రీకాంత్(Srikanth) అన్నారు. గురువారం నగరంలోని ఆయా పాఠశాలల్లో సంఘ సభ్యత్వం నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది గడిచినా పీఆర్సీని అమలు చేయలేదని, ప్రభుత్వం పెండింగ్ బిల్లు(Pending Bills)లను చెల్లించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటే.. అడ్​హక్ పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ కార్యదర్శి మల్లయ్య అఫ్జల్ బేగ్, జిల్లా సహాధ్యక్షుడు కాంతారావు, ఉపాధ్యక్షులు సాయిబాబా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.