ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని గ్రోమోర్ వ్యవసాయ ఎరువులు (Gromor Agricultural Fertilizers shops), విత్తనాల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

    Fertilizers | మండలస్థాయి అధికారులతో సమీక్ష

    తనిఖీ అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో (Madala Praja Parishad Office) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డులు (Ration shops), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses), వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖల (Horticulture) పనులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు, వనమహోత్సవం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా చేసి పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహశీల్దార్​ షబ్బీర్, ఏవో లావణ్య, ఎంపీవో జావిద్, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఏపీవో నరసయ్య, హార్టికల్చర్ అధికారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...