ePaper
More
    HomeజాతీయంTrain Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Accident | ఒడిశాలో రైలు ప్రమాదం(Train Accident Odisha) చోటు చేసుకుంది. సంబల్‌పూర్‌లోని తంగర్‌పాలి సమీపంలో షాలిమార్-సంబల్‌పూర్ రైలు చివరి కోచ్ పట్టాలు తప్పింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

    రైలు చివరి కోచ్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులు(Railway Police), అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు(Railway Officers) దర్యాప్తు జరుపుతున్నారు.

    Train Accident | నెమ్మదిగా వెళ్తుండటంతో

    సంబల్పూర్ సిటీ స్టేషన్((Sambalpur City Station) సమీపంలో షాలిమార్-సంబల్పూర్ మహిమా గోసైన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. రైలు గార్డు వ్యాన్(Train Guard Van) పక్కన ఉన్న జనరల్ కోచ్ వెనుక ట్రాలీ పట్టాలు తప్పిందన్నారు. ఆ సమయంలో చాలా నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. లేదంటే మిగతా కోచ్​లు కూడా పట్టాలు తప్పే అవకాశం ఉందన్నారు. అయితే పట్టాలు తప్పడానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు. అనంతరం ఆ కోచ్​ను తొలగించి మిగతా రైలును యథావిథిగా పంపించారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...