ePaper
More
    Homeక్రైంHyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    Hyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. మటన్​ (Mutton) తిని అస్వస్థతకు గురై ఒక్కరు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చింతల్​కుంటలో చోటు చేసుకుంది.

    చింతల్​కుంట ఆర్టీసీ కాలనీలో శ్రీనివాస్​ యాదవ్​ (46) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తున్నారు. కాగా ఆదివారం బోనాల (Bonalu Festival) సందర్భంగా శ్రీనివాస్​ మటన్​, బోటీ, చికెన్​ తీసుకొచ్చాడు. పండుగ రోజు తిన్న తర్వాత మిగిలిన కర్రీలను ఫ్రిజ్​లో పెట్టారు. సోమవారం వాటిని వేడి చేసుకొని తిన్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ కావడంతో కుటుంబంలోని 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారు ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో జాయిన్​ అయ్యారు. అయితే పరిస్థితి విషమించి శ్రీనివాస్​ యాదవ్​ మంగళవారం మృతి చెందారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Banswada | సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​...

    Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police)...

    BC bills | బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోంది..: మంత్రి సీతక్క

    అక్షరటుడే, కామారెడ్డి: BC bills | రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని...