More
    HomeతెలంగాణSuryapeta | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ పెడతామని వచ్చి.. బంగారం దుకాణంలో చోరీ

    Suryapeta | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ పెడతామని వచ్చి.. బంగారం దుకాణంలో చోరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Suryapeta | సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నగల దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సూర్యాపేట(Suryapeta) పట్టణంలో సాయి సంతోషి జ్యువెల్లరీ షాప్​(Sai Santoshi Jewellery Shop)లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు గ్యాస్​ కట్టర్​ సాయంతో షట్టర్​ ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. దుకాణంలోని 18 కిలోల బంగారం రూ.17.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    Suryapeta | యూపీకి చెందిన ముఠా

    నగల దుకాణంలో చోరీ చేసింది యూపీకి చెందిన ముఠా(UP Gang)గా పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం ఐదుగురు ముఠా సభ్యులు పట్టణంలోని ఓ బస్తీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఫాస్​ ఫుడ్​ సెంటర్(Fast Food Center)​ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు పాడుపడ్డ ఇంట్లో రెండు రూములను రెంట్​కు తీసుకున్నారు. ఈ క్రమంలో రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్​తో చోరీకి పాల్పడ్డారు. అనంతరం పారిపోయారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

    More like this

    Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

    అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు....

    Hyderabad Floods | మంచం కోసం వెళ్లి నాలాలో కొట్టుకుపోయారు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం...

    RRB Notification | నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్‌ఆర్‌బీనుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌...