ePaper
More
    Homeక్రైంKurnool | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

    Kurnool | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kurnool | ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​ (Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

    కర్నూలు కైతాళంలోని కేసీ కెనాల్‌ (KC Canal)లోకి ఆదివారం కారు దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు కారులోని వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో నలుగురిని స్థానికులు కాపాడారు. కర్ణాటక (Karnataka)లోని హుబ్లీకి చెందిన వీరు రాఘవేంద్ర స్వామి (Raghavendra Swamy) దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని హుబ్లీకి చెందిన సునీల్‌ (22), మణికంఠ (23) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...