ePaper
More
    HomeతెలంగాణKodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. రూ.నాలుగు విలువైన రెండు వేల చదరపు గజాల భూమిని ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు. తన మామ మల్లారెడ్డి యాచారం (Yacharam) మండల కేంద్రంలో కోదండరెడ్డికి భూమి బహుమతిగా ఇచ్చారు.

    ఆ భూమిలో ఇప్పటికే రైతు మిత్ర (Rythu Mitra) కమ్యూనిటీ హాల్​ పేరిట భవనం నిర్మించారు. రైతుల అవసరాల కోసం ఆ భవనంతో పాటు రెండు వేల గజాల స్థలాన్ని ఆయన వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. ఈ మేరకు శనివారం భూమి పత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించారు. సదరు భూమి విలువ మార్కెట్​ రేటు ప్రకారం రూ.నాలుగు కోట్లు ఉంటుందని సమాచారం. ఈ భూమి రైతులకు ఉపయోగ పడుతుందని తాను నమ్ముతున్నట్లు కోదండ రెడ్డి అన్నారు. అనంతరం రైతు సమస్యలపై మంత్రితో చర్చించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...