ePaper
More
    HomeజాతీయంGaribhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

    Garibhrath Express | గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Garibhrath Express | గరీభ్​రథ్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan)లోని బీవర్ జిల్లా సెంద్ర రైల్వే స్టేషన్‌లో (Sendra Railway Station) శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైలు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి.

    లోకో పైలట్ (Loco Pilot) వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్​లో మంటలు అంటుకొని పొగలు బోగీలోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు లోకో పైలెట్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. బోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇంజిన్​ కాలిపోయింది.

    సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. రైల్వే అధికారులు (Railway Officers) ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సాంకేతిక లోపం లేదంటే ఇంజిన్‌లోని షార్ట్ సర్క్యూట్(Short Circuit)​తో మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...