ePaper
More
    HomeతెలంగాణACB Case | పట్టా పాస్​బుక్​ కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ...

    ACB Case | పట్టా పాస్​బుక్​ కోసం రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. ఆయా కేంద్రాల్లో అటెండర్​, ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే తహశీల్దార్​ వరకు లంచాలు తీసుకుంటారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తారు. ప్రతి రిజిస్ట్రేషన్​కు అన్ని సక్రమంగా ఉన్నా.. ఆపరేటర్​కు రూ.500 నుంచి రూ.వెయ్యి ఇచ్చుకోవాల్సిందే. లేదంటే పనులు కావు. రేపు రాపో అని పంపిస్తారు. ఇక రిజిస్ట్రేషన్ల విషయంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే రూ.లక్షలు డిమాండ్​ చేస్తారు. తాజాగా రూ.రెండు లక్షల లంచం అడిగిన ఓ డిప్యూటీ తహశీల్దార్​పై ఏసీబీ అధికారులు (ACB Officers) కేసు నమోదు చేశారు.

    సిద్దిపేట (Siddipet) జిల్లా ములుగు మండల తహశీల్దార్ కార్యాలయంలో యెలగందుల భవాని డిప్యూటీ తహశీల్దార్​గా పని చేస్తోంది. అయితే పట్టాదార్​ పాస్​ పుస్తకం కోసం ఇటీవల ఓ వ్యక్తి కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో డిప్యూటీ తహశీల్దార్​ భవాని అతని నుంచి రూ.రెండు లక్షల లంచం డిమాండ్​ చేసింది. దీంతో సదరు వ్యక్తి బంధువు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. శుక్రవారం కార్యాలయంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు.

    ACB Case | మారని తీరు..

    లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. తమ పని తాము చేయడానికి కూడా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. అది కూడా ఒక విధిగా భావిస్తున్నారు. ఎంతోస్తే అంత అన్నట్లు రూ.వందల నుంచి రూ.లక్షల వరకు ఆయా వ్యక్తులను బట్టి అడుగుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ(Revenue), మున్సిపల్ (Municipal)​ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. ఆయా కార్యాలయాల్లోని పలువురు అధికారులు లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. వారిలో భయం లేకపోవడం గమనార్హం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...