ePaper
More
    HomeజాతీయంRahul Gnadhi | ఈసీపై రాహుల్ మ‌రోసారి తీవ్ర‌ విమ‌ర్శ‌లు.. బీజేపీకి చోరీ విభాగంగా మారింద‌ని...

    Rahul Gnadhi | ఈసీపై రాహుల్ మ‌రోసారి తీవ్ర‌ విమ‌ర్శ‌లు.. బీజేపీకి చోరీ విభాగంగా మారింద‌ని ఆరోప‌ణ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gnadhi | ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ గురువారం మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఎన్నికల కమిషన్ (Election Commission) బీజేపీ “ఎన్నికల చోరీ విభాగం”గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ ఓటర్లను మోసం చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఓటర్లకు తెలియకుండానే ఓటర్ల ఫారమ్‌లను నింపి సంతకం చేస్తున్నారని పేర్కొన్న ఒక వీడియోను ‘X’లో పోస్ట్ చేశారు.

    Rahul Gnadhi | నిజాలు చెబితే కేసులు..

    ఎన్నికల కమిషన్ ఇప్పటికీ తటస్థంగా ఉందా.. లేదా? బీజేపీ “ఎన్నికల దొంగతనం” విభాగంగా మారిందా? అని రాహుల్ ప్రశ్నించారు. “బీహార్‌(Bihar)లో, ఎన్నికల కమిషన్ ‘SIR’ పేరుతో ఓట్లను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. వారి పని కేవలం దొంగతనం. దీనికి ‘SIR’ అని పేరు పెట్టారు – వాటిని బహిర్గతం చేసే వారిపై FIR నమోదు చేస్తున్నారు. EC ఇప్పటికీ ‘ఎన్నికల కమిషన్’నా లేదా అది పూర్తిగా బీజేపీ ‘ఎన్నికల దొంగతనం’ విభాగంగా మారిందా?” అని ప్ర‌శ్నించారు.

    Rahul Gnadhi | త‌ర‌చూ ఈసీపై విమ‌ర్శ‌లు..

    కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం ఇదే మొదటిసారి కాదు. అనేక సందర్భాల్లో ఈసీ ప‌నితీరుపై సందేహాలు లేవ‌నెత్తారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఆయన ఒక పత్రికలో వివరణాత్మక వ్యాసం కూడా రాశారు. త‌ద్వారా ఈసీ విశ్వసనీయత, నిష్పాక్షికతపై విస్తృత చర్చకు తెర లేపుతున్నారు.

    బీహార్‌లో ఎన్నిక‌లు జ‌రుగనున్న త‌రుణంలోనూ ఆయ‌న ఈసీపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (Special Intensive Revision) చేప‌ట్ట‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అయితే, ఈ వ్య‌వ‌హారాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) మాత్రం స‌మ‌ర్థించింది. ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని కొనసాగించడానికి అనుమతించింది. ఆధార్, రేషన్ కార్డ్, ఓటరు IDని చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువుగా అంగీకరించడాన్ని పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేప‌థ్యంలోనే శనివారం సాయంత్రం నాటికి బీహార్‌లో 80.11 శాతం మంది ఓటర్లు తమ ఫారాలను సమర్పించారని ఈసీ తెలిపింది. జూలై 25 గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...