ePaper
More
    HomeజాతీయంRahul Gnadhi | ఈసీపై రాహుల్ మ‌రోసారి తీవ్ర‌ విమ‌ర్శ‌లు.. బీజేపీకి చోరీ విభాగంగా మారింద‌ని...

    Rahul Gnadhi | ఈసీపై రాహుల్ మ‌రోసారి తీవ్ర‌ విమ‌ర్శ‌లు.. బీజేపీకి చోరీ విభాగంగా మారింద‌ని ఆరోప‌ణ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gnadhi | ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ గురువారం మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఎన్నికల కమిషన్ (Election Commission) బీజేపీ “ఎన్నికల చోరీ విభాగం”గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ ఓటర్లను మోసం చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఓటర్లకు తెలియకుండానే ఓటర్ల ఫారమ్‌లను నింపి సంతకం చేస్తున్నారని పేర్కొన్న ఒక వీడియోను ‘X’లో పోస్ట్ చేశారు.

    Rahul Gnadhi | నిజాలు చెబితే కేసులు..

    ఎన్నికల కమిషన్ ఇప్పటికీ తటస్థంగా ఉందా.. లేదా? బీజేపీ “ఎన్నికల దొంగతనం” విభాగంగా మారిందా? అని రాహుల్ ప్రశ్నించారు. “బీహార్‌(Bihar)లో, ఎన్నికల కమిషన్ ‘SIR’ పేరుతో ఓట్లను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. వారి పని కేవలం దొంగతనం. దీనికి ‘SIR’ అని పేరు పెట్టారు – వాటిని బహిర్గతం చేసే వారిపై FIR నమోదు చేస్తున్నారు. EC ఇప్పటికీ ‘ఎన్నికల కమిషన్’నా లేదా అది పూర్తిగా బీజేపీ ‘ఎన్నికల దొంగతనం’ విభాగంగా మారిందా?” అని ప్ర‌శ్నించారు.

    READ ALSO  Kanwar Yatra | కన్వర్ యాత్రికులపై దూసుకెళ్లిన కారు

    Rahul Gnadhi | త‌ర‌చూ ఈసీపై విమ‌ర్శ‌లు..

    కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం ఇదే మొదటిసారి కాదు. అనేక సందర్భాల్లో ఈసీ ప‌నితీరుపై సందేహాలు లేవ‌నెత్తారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఆయన ఒక పత్రికలో వివరణాత్మక వ్యాసం కూడా రాశారు. త‌ద్వారా ఈసీ విశ్వసనీయత, నిష్పాక్షికతపై విస్తృత చర్చకు తెర లేపుతున్నారు.

    బీహార్‌లో ఎన్నిక‌లు జ‌రుగనున్న త‌రుణంలోనూ ఆయ‌న ఈసీపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (Special Intensive Revision) చేప‌ట్ట‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అయితే, ఈ వ్య‌వ‌హారాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) మాత్రం స‌మ‌ర్థించింది. ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని కొనసాగించడానికి అనుమతించింది. ఆధార్, రేషన్ కార్డ్, ఓటరు IDని చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువుగా అంగీకరించడాన్ని పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేప‌థ్యంలోనే శనివారం సాయంత్రం నాటికి బీహార్‌లో 80.11 శాతం మంది ఓటర్లు తమ ఫారాలను సమర్పించారని ఈసీ తెలిపింది. జూలై 25 గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

    READ ALSO  Election Commission | సుప్రీంకోర్టుతో విభేదించిన సీఈసీ.. ఆధార్‌, రేష‌న్ ప్రామాణికం కాదన్న ఈసీ

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...