ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | సీఎం రేవంత్​రెడ్డి రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్​

    MLC Kavitha | సీఎం రేవంత్​రెడ్డి రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్​ చేశారు. గురువారం ఆమె జాగృతి కార్యాలయం(Jagruti Office)లో విలేకరులతో మాట్లాడారు.

    గోదావరి జలాల విషయంలో సీఎం తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)​ గురించి చర్చించినట్లు ప్రెస్​ ఇన్ఫరేషన్​ బ్యూరో ప్రెస్​నోట్​లో ఉందన్నారు. కానీ సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మీడియా సమావేశంలో బనకచర్ల గురించి చర్చించలేదని చెప్పారన్నారు. సీఎం తీరుతో తెలంగాణ ప్రజలు గోదావరి జలాల్లో హక్కులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి సీఎం పదవి కొనసాగడానికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలన్నారు.

    MLC Kavitha | సీఎం సాధించింది ఏమి లేదు

    కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో సీఎం నాలుగు విజయాలు సాధించినట్లు చెప్పారన్నారు. అందులో టెలీమెట్రి (Telemetry) ఒకటని ఆయన ప్రకటించారు. అయితే టెలీమెట్రి విధానం ఎప్పటి నుంచో అమలులో ఉందన్నారు. మొదటి దశ ఇప్పటికే అమలు చేస్తున్నారని, ఇప్పుడు రెండో దశ చేస్తారన్నారు. అందులో సీఎం సాధించిన విజయం ఏమిటని ఎద్దేవా చేశారు. అలాగే మన భూ భాగంలో ఉన్న నాగార్జున సాగర్​ రిపేర్లు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చూసుకుంటుందని, ఆంధ్రలో ఉన్న శ్రీశైలం మరమ్మతులు అక్కడి ప్రభుత్వం చేపడుతుందన్నారు.

    MLC Kavitha | హక్కులను తాకట్టు పెట్టారు

    నదుల అనుసంధానంపై గతంలో వివాదం చెలరేగినప్పుడు కూడా అధికారుల కమిటీ వేశారని, ఇప్పుడు కూడా వేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఈ కమిటీ అంశాల్లో బనకచర్ల ప్రాజెక్ట్​ను చేర్చారని, సీఎం రేవంత్​రెడ్డి అందులో సంతకం చేసి వచ్చారని మండి పడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులను సీఎం రేవంత్​రెడ్డి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దగ్గర తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్​ కుట్రపూరితమైనదని ఆమె అన్నారు. దీంతో ఆంధ్ర ప్రజలకు కూడా లాభం లేదన్నారు. కమీషన్ల కోసమే దీనిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్​ను మేఘా కంపెనీకి ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...