ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు బీఎన్​ఎస్​163 (BNS 163) చట్టం అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    గల్ఫ్ బాధిత కుటుంబాల విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అబద్ధాలు ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయడానికి కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం వేల్పూరు వస్తున్నట్లు మానాల తెలిపారు. ప్రశాంత్​రెడ్డి వేల్పూర్​ రావాలని ఆయన సవాల్​ విసిరారు. దీంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో సీపీ సాయి చైతన్య బీఎన్​ఎస్​ 163 యాక్ట్​ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...