అక్షరటుడే, బాన్సువాడ:Mla Pocharam Srinivas Reddy | మహారాష్ట్రలోని పండరీపూర్లో రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి(Rukmini Panduranga Vithaleswara Swamy) ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విఠలేశ్వరుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట అంజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులున్నారు.
