PCC Chief | వరంగల్​లో జరిగింది వీస్కీ బాటిళ్ల మీటింగ్​: పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​గౌడ్
PCC Chief | వరంగల్​లో జరిగింది వీస్కీ బాటిళ్ల మీటింగ్​: పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​గౌడ్

అక్షరటుడే, వెబ్​డెస్క్​:PCC Chief | వరంగల్​లో జరిగింది వీస్కీ బాటిళ్ల(Whiskey bottle) మీటింగ్​ అంటూ పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్ pcc chief Mahesh Kumar goud​ విమర్శించారు. బీఆర్​ఎస్​ రజతోత్సవ(BRS Silver Jubilee) సభలో కేసీఆర్(KCR)​ చేసిన వ్యాఖ్యలపై ఆయన​ స్పందించారు. గులాబీ బాస్​కు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు.

‘ప్రజలతో తిరస్కరించబడి.. ఫాంహౌస్​ పరిమితమై.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. ప్రజల గురించి ఒక్క రోజు కూడా ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) కేసీఆర్​’ అని పేర్కొన్నారు. ఆయన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ జరిగింది విస్కీ బాటిళ్ల సమావేశమని ఎద్దేవా చేశారు. సభలో జనం కన్నా ఎక్కువ విస్కీ బాటిళ్లే ఉన్నాయని అందరూ చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

PCC Chief | చర్చకు సిద్ధం

కాంగ్రెస్​ పాలనలో చేసిన పనులపై కేసీఆర్(KCR) ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమని.. సమయం, వేదిక మీరే డిసైడ్​ చేయండంటూ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలన, 15 నెలల కాంగ్రెస్​ పాలనలో చేసిన పనులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్​ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంతో ప్రజాధనాన్ని అత్యంత ఎక్కువగా దోచుకున్నది కేసీఆర్​ కుటుంబమేనని విమర్శించారు. దూరదృష్టి, ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేసి పలాయనం చిత్తగించిన వ్యక్తి కాంగ్రెస్(Congress Government)​ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.