ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Scholarship applications | విద్యార్థులకు గుడ్​న్యూస్​​.. స్కాలర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

    Scholarship applications | విద్యార్థులకు గుడ్​న్యూస్​​.. స్కాలర్​షిప్​కు దరఖాస్తుల ఆహ్వానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scholarship applications | రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్​ మెట్రిక్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్​షిష్​ల​ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

    రాష్ట్రంలో పదో తరగతి పూర్తయి ఇంటర్​, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్​షిప్​ మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త స్కాలర్​షిప్​ల దరఖాస్తులు, పాత విద్యార్థుల రెన్యూవల్​ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది.

    Scholarship applications | సెప్టెంబర్​ 30 వరకు గడువు

    ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్​ 30లోపు స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్​షిప్​ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది. స్కాలర్​షిప్​ అప్లై చేయడానికి కింది లింక్​ను క్లిక్​ చేయండి..

    https://telanganaepass.cgg.gov.in/epassonlinelinks.do

    More like this

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...