ePaper
More
    HomeతెలంగాణMalnadu drug case | మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి.. నిందితుల్లో పోలీసు...

    Malnadu drug case | మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి.. నిందితుల్లో పోలీసు అధికారి కుమారుడు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Malnadu drug case : కోంపల్లిలో జరిగిన మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. సైబరాబాద్​ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో ఎస్ఐబీ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ పాత్ర ఉంది. డిచ్పల్లి కొకైన్​ కేసులోనూ రాహుల్ తేజ నిందితుడిగా ఉన్నాడు. ఇతడితోపాటు సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ కూడా మల్నాడు డ్రగ్స్ కేసులో ఉండటంతో ఈగల్​ టీం ఇద్దరిని అరెస్టు చేసింది.

    డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్​వర్క్​ను ఈగల్​ టీం ఛేదించే పనిలో పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన హర్ష, సూర్య సహా ఎనిమిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. తాజాగా మరికొందరిని అరెస్టు చేసింది.

    Malnadu drug case : నిజామాబాద్​ కొకైన్​ కేసులోనూ నిందితుడు..

    నిజామాబాద్ Nizamabad లోనూ గత నెల నమోదైన డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ సూత్రధారిగా ఉన్నాడు. అతడి కోసం డిచ్పల్లి పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్​ PT జారీ చేశారు.

    మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజను ఈగల్ టీం అరెస్టు చేసింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాహుల్, సూర్య, హర్ష కలిసి మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.

    Malnadu drug case : ఎవరీ సూర్య..

    హైదరాబాద్ శివారులో ఉన్న రిసార్టులో సూర్య వీకెండ్లకు డ్రగ్ పార్టీలు నిర్వహించేవాడని తెలిసింది. మల్నాడు రెస్టారెంట్​లోనూ డ్రగ్స్ సరఫరా చేసేవాడని తేలింది. ఫుడ్ బ్లాగర్ గా ప్రసిద్ధి పొందిన guise లో పబ్​లలోని ఫుడ్ ల గురించి ప్రచారం చేసేవాడు సూర్య. అయితే అదే ముసుగులో రహస్యంగా తన డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.

    Malnadu drug case : హర్ష పాత్ర ఏంటంటే..

    ఇక హర్ష ది కూడా ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్నాడు. పుణె, ముంబయి, గోవా వంటి నగరాల నుంచి డ్రగ్స్ తెచ్చి, సూర్యకు సరఫరా చేసేవాడు. గ్రేటర్​ హైదరాబాద్​లో డ్రగ్ పార్టీలు నిర్వహించడంలో హర్ష ప్రధాన సూత్రధారి.

    Malnadu drug case : ఎనిమిది పబ్​లు..

    తాజా డ్రగ్స్ కేసులో ఈగల్​ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది పబ్ యజమాన్యాలు డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. త్వరలోనే మరి కొన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...