ePaper
More
    HomeతెలంగాణHigh Court | హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

    High Court | హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (Justice Aparesh Kumar Singh) నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సోమవారం ఆమోదించారు. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతున్న సుజయ్ పాల్‌ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ అపరేష్ కుమార్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా (Tripura High Court Judge) పని చేశారు.

    అపరేష్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్​ఎల్​బీ చదివారు. 1990 నుంచి 2000 వరకూ యూపీ హైకోర్టులో న్యాయవాదిగా (UP High Court Judge) పనిచేశారు. అనంతరం 2001లో జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జీగా నియామకం అయ్యారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ నుంచి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి సాధించారు. తాజాగా తెలంగాణ తెలంగాణకు బదిలీపై వస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...