Fee reimbursement
Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ను తక్షణమే చెల్లించాలి

అక్షరటుడే కామారెడ్డి: Fee reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి కాంగ్రెస్​ ప్రభుత్వమే నేడు బకాయిలను పెండింగ్​లో పెట్టడం శోచనీయమని ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్​ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ(SFI) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్​ను ముట్టడించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Fee reimbursement | మూడేళ్లుగా పెండింగ్​లోనే..

ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. మూడేళ్లుగా స్కాలర్​షిప్​లను (Scholarships) పెండింగ్​లో పెట్టిందని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొండిచేయి చూపడం అన్యాయమన్నారు. ఫలితంగా విద్యార్థుల సర్టిఫికెట్ల కోసం కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తున్నాయని వాపోయారు. రూ.9 కోట్ల వరకు రీయింబర్స్​మెంట్​ బకాయిలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ (SFI Kamareddy) జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, నాయకులు స్టాలిన్, మణికంఠ, రాహుల్, నితిన్, నవీన్, సాయిప్రకాష్ గౌడ్, మణిరజ్, రాఘవ, ప్రభు, అర్జున్, సాయి తదితరులు పాల్గొన్నారు.