ePaper
More
    HomeతెలంగాణCyber Fraud | సైబర్​ బాధితులకు గోల్డెన్​ అవర్​.. ఆ గంటలో ఫోన్​ చేస్తే మీ...

    Cyber Fraud | సైబర్​ బాధితులకు గోల్డెన్​ అవర్​.. ఆ గంటలో ఫోన్​ చేస్తే మీ డబ్బు భద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Fraud | దేశంలో సైబర్​ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో సైబర్​ నేరస్తులు ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆశ చూపి కొందరు.. భయ పెట్టి మరికొందరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు (police) సైబర్​ నేరాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసు కళాజాత బృందాలు సైబర్​ నేరాలపై(Cyber Frauds) అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అయితే సైబర్​ నేరానికి గురైనా.. గంటలోపు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగి పొందవచ్చు.

    ఒక్కొసారి మనకు సైబర్​ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. బెదిరించో.. ఆశ చూపో ఖాతాలోని డబ్బులు కాజేస్తారు. అయితే ఖాతాలో నుంచి డబ్బులు కట్​ కాగానే ఆందోళన చెందకుండా.. సైబర్​ క్రైం విభాగం టోల్​ ఫ్రీ (Cyber Crime Number) నంబర్​ 1930కి ఫోన్​ చేసి వివరాలు అందించాలి. గంటలోపు కంప్లైంట్ చేయడం ద్వారా డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఖాతా వివరాలు ఇస్తే పోలీసులు వెంటనే సైబర్​ నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్​ చేస్తారు. సైబర్​ బాధితులకు ఈ గోల్డెన్​ అవర్ (Golden Hour)​ ఎంతో కీలకం. అందుకే పోలీసులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సైబర్​ నేరానికి గురయితే గోల్డెన్​ అవర్​లో కంప్లైంట్​ చేయాలని కోరుతున్నారు.

    Cyber Fraud | బలవుతున్న ఎంతోమంది

    సైబర్​ నేరస్తుల చేతికి చిక్కి ఎంతో మంది బలి అవుతున్నారు. వీరిలో ఉన్నత విద్యా వంతులు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల ఓ మహిళా పార్ట్​ టైం జాబ్​ పేరిట టెలిగ్రామ్​ యాప్​లో ప్రకటన చూసి వారిని సంప్రదించింది. మొదట పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని వారు నమ్మించారు. దీంతో ఆ మహిళ రూ.లక్ష వారు చెప్పినట్లు పెట్టుబడి పెట్టింది. తర్వాత మోసపోయానని తెలియడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. గతంలో ఓ సీనియర్​ ఐఏఎస్​ అధికారి సైతం స్టాక్​ మార్కెట్​ పేరిట సైబర్​ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి రూ.లక్షలు పోగొట్టుకున్నారు.

    Cyber Fraud | ఇలా మోసం చేస్తారు..

    సైబర్​ నేరగాళ్లు మీకు లాటరీ వచ్చిందని కొంత డబ్బులు కట్టాలని ఫోన్లు చేస్తారు. రూ.లక్షల లాటరీ డబ్బులు ఇచ్చే వారు.. డబ్బు ఎందుకు కట్టమంటారని ఆలోచిస్తే వారి నుంచి తప్పించుకోవచ్చు. పార్ట్​ టైం జాబ్​(part Time Job), వర్క్​ ఫ్రం హోమ్​ (Work From Home) పేరిట కూడా మోసాలు చేస్తారు. అయితే జాబ్​ ఇచ్చే వారు సాలరీ ఇస్తారు.. వారికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అడిగారంటే సైబర్​ నేరస్తులుగా గుర్తించాలి.

    మీకు భారీ గిఫ్ట్​ వచ్చిందని దానిని డెలివరీ చేయడానికి డబ్బులు కావాలని ఫోన్​ చేస్తారు. అయితే మనకు ఎవరు ఊరికే బహుమతులు పంపరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మీకు వచ్చిన పర్సల్​లో డ్రగ్స్​ ఉన్నాయని కస్టమ్స్​ అధికారుల పేరిట ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడతారు. అలాంటి సమయంలో భయ పడకుండా 1930 నంబర్​కు ఫోన్​ చేయాలి. లేదంటే స్థానిక పోలీసులను సంప్రదించాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి సైబర్​ నేరగాళ్లు ఎక్కువ మోసాలకు పాల్పడతారు.

    అత్యాశకు పోకుండా ఫోన్​ చేయగానే.. కొంచెం ఆలోచిస్తే సైబర్​ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటాం. అలాగే ఎవరికీ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఇవ్వొద్దు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు క్లిక్​ చేయొద్దు. ఏపీకే ఫైళ్లు డౌన్​లోడ్​ చేసుకోవద్దు. ఒకవేళ డబ్బులు కట్ అయితే గంటలోపు 1930 నంబర్​కు ఫోన్​ చేయాలి.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...