అక్షరటుడే, వెబ్డెస్క్: Haryana | హర్యానాలోని హిసార్ జిల్లాలో (Hisar district) దారుణం చోటు చేసుకుంది. క్రమశిక్షణతో ఉండాలని, జుట్టు కత్తిరించుకోవాలని మందలించిన ప్రిన్సిపల్ పై ఇద్దరు విద్యార్థులు కక్షగట్టారు. గురు పౌర్ణిమ రోజైన (Guru Purnima Day) గురువారం నాడే ప్రిన్సిపల్ ను కత్తితో పొడిచి చంపారు. నార్నాండ్ ప్రాంతంలోని బాస్ గ్రామంలో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది.
Haryana | మందలించినందుకు..
బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ (Kartar Memorial Senior Secondary School principal).. క్రమశిక్షణ విషయంలో కాస్త కఠినంగా ఉంటారు. అయితే, ఇద్దరు విద్యార్థులు క్రమశిక్షణ పాటించక పోవడం, జుట్టు పెంచుకోవడాన్ని గమనించిన ఆయన వారిని మందలించారు. ప్రిన్సిపల్ తిట్టాడని ఆగ్రహానికి గురైన సదరు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. కత్తితో ఆయనను పొడిచి హత్య చేశారని హన్సి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అమిత్ యశ్వర్ధన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం హిసార్ కు పంపించామని చెప్పారు. హత్యపై కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు.