ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిVarni | పింఛన్​ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

    Varni | పింఛన్​ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. అక్రమ సంబంధాలు, డబ్బులు, కుటుంబ తగాదాలతో ఇలా నిత్యం హత్యలు జరుగుతున్నాయి. స్వార్థం కోసం సొంత వారినే పొట్టన పెట్టుకుంటున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందనే ఆందోళన కలుగుతోంది. తాజాగా పింఛన్​ డబ్బుల కోసం నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా వర్ని(varni) మండలంలో గురువారం చోటు చేసుకుంది.

    ఎస్సై మహేష్ (SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం జలాల్​పూర్​ (jalalpur) గ్రామానికి చెందిన మక్కపల్లి సాయవ్వ(57)తో కొడుకు సాయిలు పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంతో కుర్చీతో కొట్టి.. బండరాయితో తల, చాతి, పొట్టపై దాడిచేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను 108 అంబులెన్స్​లో బోధన్​ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయవ్వ చెల్లెలి కొడుకు జట్టి మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...