ePaper
More
    HomeతెలంగాణHyderabad | తండ్రిని చంపి సెకండ్​ షో సినిమాకు వెళ్లిన కూతురు

    Hyderabad | తండ్రిని చంపి సెకండ్​ షో సినిమాకు వెళ్లిన కూతురు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కన్న వారిని, కట్టుకున్న వారిని కడతేర్చడానికి కూడా ఆలోచించడం లేదు. తాత్కాలిక సుఖాలు, ఆనందాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు కడుపును బిడ్డలను కూడా చంపుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది. అనంతరం సెకండ్​ షో సినిమా (Second Show Movie)కు వెళ్లొచ్చి.. మృతదేహాన్ని చెరువులో పడేసింది.

    Hyderabad | భర్త వదిలేయడంతో..

    హైదరాబాద్​(Hyderabad)లోని ముషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన తండ్రిని ఓ యువతి ప్రియుడితో కలిసి హతమార్చింది. ముషీరాబాద్ (Musheerabad)​కు చెందిన మనీషా(25)కు గతంలోనే వివాహం అయింది. అయితే ఆమె జావీద్​ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను వదిలేశాడు. అయినా జావీద్​తో మనీషా సంబంధం కొనసాగిస్తోంది. ఇది నచ్చని ఆమె తండ్రి వడ్లూరి లింగం(45) కూతురిని మందలించి ఇంటికి రమ్మన్నాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడని మనీషా తండ్రిపై పగ పెంచుకుంది.

    Hyderabad | కల్లులో మత్తు మందు కలిపి..

    తన తండ్రిని చంపడానికి మనీషా ఆమె ప్రియుడు జావిద్ ​ తన తల్లితో కలిసి పథకం పన్నింది. ఇందులో భాగంగా కల్లులో మత్తు మందు కలిపి లింగంకు ఇచ్చారు. ఆయన తాగి పడుకోగానే.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం తన ప్రియుడితో కలిసి మనీషా సెకండ్​ షో సినిమాకు వెళ్లారు. సినిమా నుంచి వచ్చాక లింగం మృతదేహాన్ని ఘట్‌కేసర్‌ ఏదులాబాద్‌ చెరువు(Ghatkesar Edulabad Lake)లో పడేశారు. చెరువులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు మనీషా ఆమె ప్రియుడు జావీద్​, తల్లి శారదను అదుపులోకి తీసుకున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు.

    Hyderabad | సమాజం ఎటు పోతుంది

    ఇటీవల చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ప్రేమ, వివాహేతర సంబంధాలతో కొందరు హత్య చేస్తున్నారు. ఇటీవల జీడిమెట్లలో ఓ పదో తరగతి బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించిన విషయం తెలిసిందే. గద్వాల్​కు చెందిన తేజేశ్వర్​ అనే సర్వేయర్​ను ఆమె భార్య పెళ్లైన నెల రోజులకు ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఇటీవల ఓ మహిళా మద్యం మత్తులో తన ఐదు నెలల కూతురును చంపేసింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...