అక్షరటుడే, హైదరాబాద్: Naxalism : మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరింది. కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్, ప్రొ. అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రిని ప్రతినిధులు కోరారు. ప్రజా ప్రభుత్వం నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో మాత్రమే చూస్తోందని, శాంతి భద్రతల అంశంగా పరిగణించదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డి కి ఉందని, ఈ విషయంలో మంత్రులతో పాటు జానారెడ్డి సలహాలు, సూచనలను తీసుకుంటామని సీఎం తెలిపారు.