అక్షరటుడే, వెబ్డెస్క్: HCA President | సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు (HCA President) జగన్మోహన్రావును సీఐడీ (CID) బుధవారం అరెస్ట్ చేసింది. ఐపీఎల్ (IPL) మ్యాచ్ల సందర్భంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి, హెచ్సీఏ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపణలపై విచారణ జరిపిన సీఐడీ తాజాగా హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును అరెస్ట్ చేసింది.
HCA President | టికెట్ల కోసం బెదిరింపులు
ఐపీఎల్ ప్రాంచైజీ టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ను టిక్కెట్ల కోసం హెచ్సీఏ బెదిరించింది. ఈ మేరకు సన్ రైజర్స్ యాజమాన్యం గతంలోనే తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు టికెట్లు కేటాయించలేదని హెచ్సీఏ కార్పొరేట్ బాక్స్ ఆఫీస్కు తాళం వేసిన విషయం తెలిసిందే. దీంతో తాము హైదరాబాద్ వదిలి వేరే రాష్ట్రంలో మ్యాచ్లు ఆడతామని ఎస్ఆర్హెచ్ పేర్కొంది. దీంతో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఈ విషయమై సీరియస్ అయ్యారు. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
HCA President | విజిలెన్స్ నివేదిక ఆధారంగా..
ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ (Uppal) వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకు ఆ జట్టు యాజమాన్యం 10 శాతం టికెట్లను హెచ్సీఏకు ఉచితంగా ఇచ్చింది. అయితే మరో 10శాతం కావాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. దీనికి జట్టు ఒప్పుకోలేదు. దీంతో ఓపెన్ మార్కెట్లో కొనేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్రావు కోరారు. హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టడంతో ఎస్ఆర్హెచ్ ఓపెన్ మార్కెట్లో కొనడానికి మరో 10శాతం టికెట్లు కేటాయించింది.
తనకు వ్యక్తిగతంతో మరో 10శాతం టికెట్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ఫ్రాంచైజీ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వివాదం పెద్దదిగా మారింది. టికెట్లు ఇవ్వలేదని హెచ్సీఏ కార్పొరేట్ బాక్స్ ఆఫీసుకు తాళం వేసింది. దీంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు (Vigilance officers) హెచ్సీఏ ప్రెసిడెంట్ SRH మేనేజ్మెంట్పై టికెట్ల కోసం ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో హెచ్సీఏపై కేసు నమోదు చేసిన సీఐడీ తాజాగా అధ్యక్షుడు జగన్మోహన్రావును అరెస్ట్ చేసింది.