ePaper
More
    HomeతెలంగాణMLA Prashanth Reddy | పల్లె దవాఖానాలతో గ్రామీణుల చెంతకే వైద్యం

    MLA Prashanth Reddy | పల్లె దవాఖానాలతో గ్రామీణుల చెంతకే వైద్యం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: MLA Prashanth Reddy | పల్లెల్లో ప్రజలందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి (MLA Prashanth Reddy) పేర్కొన్నారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గంలో రూ. 1.20 కోట్లతో నిర్మించిన మూడు పంచాయతీ భవనాలు, మూడు పల్లె దవాఖానాలను ఆయన ప్రారంభించారు.

    MLA Prashanth Reddy | కేసీఆర్​ ఆలోచనకు ప్రతిరూపం..

    బీఆర్​ఎస్​ ప్రభుత్వ(BRS Government) హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను(Medical Colleges) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పల్లెల్లో నాణ్యమైన వైద్యం అందాలనే ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకరవర్గ బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

    MLA Prashanth Reddy | పార్టీలో చేరికలు

    మెండోరా మండలం సోన్​పేట్​ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ చిన్నోళ్ల రమేష్, మాజీ ఎంపీటీసీ మాడుగుల నాగలక్ష్మి, తోపారం హన్మాండ్లు, రాకేష్, ముత్యం, సాగర్, మల్లేష్, ప్రశాంత్, పులి గంగాధర్, రాజన్న, శ్రావణ్, మదన్ తదితరులు ఉన్నారు.

    ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న కార్యకర్తలు

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...