అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Padmasali Sangam | నిజామాబాద్ నగరంలోని వినాయక్నగర్ (vinayak nagar) 49వ తర్ప పద్మజ్యోతి పద్మశాలి సంఘం (Padma Jyoti Padmasali Sangham) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది యాదగిరి వ్యవహరించారు.
అధ్యక్షుడిగా అంకం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా గజం సుదర్శన్, కోశాధికారిగా సుప్పల వెంకట లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే సంఘ సమావేశంలో ఎన్నుకుంటామని నూతన అధ్యక్షుడు అంకం రాజేందర్ పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.