Nizamabad District Court

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad District Court | సీనియర్​ న్యాయవాది నరసింహారెడ్డి (Narasimha Reddy) అడిషనల్​ పీపీగా (Additional PP) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ (Special Chief Secretary) రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్​ మొదటి అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​గా నరసింహారెడ్డి మూడేళ్లు పనిచేయనున్నారు.

Nizamabad District Court | 40ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో..

నరసింహారెడ్డి నాలుగు దశబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాలో సీనియర్​ న్యాయవాదుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. రూరల్​ నియోజకవర్గంలోని (Rural constituency) అనంతగిరి గ్రామానికి చెందిన ఆయన జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా బార్​ అసోసియేషన్(Bar Association)​ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్​రాజు తదితరులు అభినందనలు తెలిపారు.