అక్షరటుడే, వెబ్డెస్క్ : Odisha | ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ కావడానికి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. రీల్స్ (Reels) పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వ్యూస్, లైక్ల మత్తులో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు. కొందరు అసభ్యకర వీడియోలు, బూతులతో ఫేమస్ అవుతుంటే.. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలుడు రీల్స్ కోసం రైల్వే ట్రాక్పై పడుకున్నాడు.
ఒడిశా(Odisha)లో ఓ బాలుడు రైల్వే ట్రాక్ (RaIlway Track)పై పడుకొని రీల్స్ తీయడం గమనార్హం. రెండు సిమెంట్ కడ్డీల మధ్య పడుకొని రైలు పోయేంత వరకు కదలకుండా అలాగే పడుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్పై పడుకున్న బాలుడితోపాటు సహకరించిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏమాత్రం కదిలినా బాలుడి ప్రాణాలు పోయేవి. రీల్స్, షార్ట్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Odisha | తల్లిదండ్రులు గమనించాలి
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. చాలా మంది రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా టీనేజీ యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. వీరు ఎలాగైనా ఫేమస్ కావాలని నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. రీల్స్ కోసం పిచ్చి చేష్టలు చేస్తే మొదట్లోనే మందలించాలని చెబుతున్నారు. లేదంటే తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే తీరని వేదన మిగులుతుందంటున్నారు.
Read all the Latest News on Aksharatoday.in