ePaper
More
    Homeక్రైంMinarpally | మినార్​పల్లిలో దారుణం.. భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

    Minarpally | మినార్​పల్లిలో దారుణం.. భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య

    Published on

    అక్షరటుడే, బోధన్: మండలంలోని మినార్​పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య గొంతు కోసి హత్య చేసింది. రూరల్​ ఎస్సై మచ్చేందర్​​ రెడ్డి (Rural Sub-Inspector Machender Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మినార్​పల్లి గ్రామంలో దేశ్యానాయక్​కు భార్య, కొడుకు ఉన్నారు.

    అయితే కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం రాత్రి దేశ్యానాయక్​ ఇంట్లో నుంచి అరుపులు వినిపించగా స్థానికులు వెళ్లి పరిశీలించారు. అయితే అప్పటికే దేశ్యానాయక్​ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి (Bodhan Government Hospital) తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బోధన్​ రూరల్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్యతో పాటు కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా.. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...