అక్షరటుడే, వెబ్డెస్క్:Spicejet | నిత్యం విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అహ్మదాబాద్లో విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంతో పాటు హాస్టల్లో ఉన్నవారు మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. ఈ ప్రమాదం అనంతరం విమానం ఎక్కాలంటే ప్రయాణికులు ఆలోచిస్తున్నారు.
Spicejet | నిత్యం సమస్యలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. నిత్యం విమానాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో విమానంలో వెళ్లాలంటనే ప్రయాణికులు జంకుతున్నారు. గంటల ముందు ఎయిర్పోర్టుకు చేరుకున్నాక సాంకేతిక సమస్యతో రన్వేపై విమానాలు నిలిచిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా చెన్నై నుంచి హైదరాబాద్(Chennai to Hyderabad) వస్తున్న స్పైస్ జెట్(Spicejet) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయింది. రెండు గంటలుగా చెన్నై ఎయిర్పోర్ట్(Chennai Airport)లో విమానం లోనే ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారు ఎయిర్ లైన్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.