ePaper
More
    HomeతెలంగాణNizamabad City | శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక నిర్మాణాలను కాపాడాలి

    Nizamabad City | శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక నిర్మాణాలను కాపాడాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లాలోని పురాతనమైన చారిత్రక నిర్మాణాలను (ancient historical structures) కాపాడి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇతిహాస సంకలన సమితి జిల్లా కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ అంకిత్​కు (Additional Collector Ankit) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయం (Killa Ram Temple) అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. నిజాం కాలంలో దాశరథి కృష్ణమాచార్యులు నుంచి మొదలు ఎందరో స్వాతంత్ర సమరయోధులను ఇదే జైలులో బంధించినట్లు సాక్షాలు ఉన్నాయన్నారు.

    ఎంతో మహోన్నతమైన చరిత్ర కలిగిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వాటి పునరుద్ధరించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ఇతిహాస సంకలన సమితి జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్, కార్య అధ్యక్షుడు మోహన్ దాస్, ఉపాధ్యక్షురాలు శైలి బెల్లాల్, కార్యదర్శులు కందకుర్తి ఆనంద్, డాక్టర్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...