ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy Mla | ఐటీ కంపెనీలతో యువతకు ఉపాధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

    Yellareddy Mla | ఐటీ కంపెనీలతో యువతకు ఉపాధి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Mla | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో రూ.2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకల సదుపాయాలతో టీజీఐఐసీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గానికి ఇప్పటికే ఒక కంపెనీని తీసుకొచ్చానని, అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుందన్నారు. మరిన్ని కంపెనీలతో కూడా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ కంపెనీలు రావడం వల్ల నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఎన్నో సార్లు జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉపాధి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

    ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు రూ.23 కోట్ల నిధులను విడుదల చేయించానని తెలిపారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిర్మాణ పనుల్లో భాగంగా భూంపల్లి, మోతే, కాటేవాడి జలశయాల నిర్మాణాలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లతో మాట్లాడి పెండింగ్​లో ఉన్న నిధులు క్లియరెన్స్​ చేయించామన్నారు. ఆర్థిక శాఖ నుంచి ఫైనల్ అప్రూవల్ వస్తే జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంతో మాట్లాడతానని, రైతుల వివరాలు నివేదిక తయారు చేసి వారం రోజుల్లో అందించాలని తహశీల్దార్​కు సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...