ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Railway Passengers | ఆ మార్గంలో తొలిసారి కూతపెట్టనున్న ప్రయాణికుల రైలు.. ఎక్కడో తెలుసా..!

    Railway Passengers | ఆ మార్గంలో తొలిసారి కూతపెట్టనున్న ప్రయాణికుల రైలు.. ఎక్కడో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Passengers | ఏళ్ల క్రితం నిర్మించిన ఆ రైల్వే మార్గంలో తొలిసారి ప్రయాణికుల రైలు కూత పెట్టనుంది. తమ చెంతనే రైల్వే మార్గం ఉన్నా.. రైలు ఎక్కే భాగ్యం లేక ప్రజలు ఇన్ని రోజులు ఇబ్బందులు పడేవారు. తాజాగా రైల్వేశాఖ (Railway Department) ప్రయాణికుల రైలు నడపడానికి ఆమోదం తెలపడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతిలోని (Amaravati) నడికుడి నుంచి శ్రీకాళహస్తి (Srikalahasti) వరకు రైల్వేలైన్​ ఏళ్ల క్రితం నిర్మించారు. అయితే ఈ మార్గంలో కేవలం గూడ్స్​ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్రయాణికుల రైళ్ల నడపాలని ఆయా గ్రామాల ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రైల్వేశాఖ వీక్లీ ఎక్స్​ప్రెస్​ (weekly express) నడపడానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

    Railway Passengers | ప్రతి శుక్రవారం

    శ్రీకాళహస్తి – నడికుడి రైల్వే మార్గంలో (Srikalahasti – Nadikudi railway line) ఈనెల 4న తొలి రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నెమలపురి, రోంపిచర్ల రైల్వే స్టేషన్లలో టికెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం ఈ రైలు నడుస్తుందని వారు పేర్కొన్నారు. జులై 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం ఈ రైలు మహారాష్ట్రలోని నాందేడ్​ నుంచి బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతోంది. వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కు, నాందేడ్‌కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుకుంటుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...