- Advertisement -
HomeతెలంగాణInspectors Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

Inspectors Transfers | పలువురు ఇన్​స్పెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Inspectors Transfers | మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి (IG Chandrasekhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఎనిమిది మంది సీఐలను ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇందులో ముగ్గురికి ఎక్కడ పోస్టింగ్​ ఇవ్వకపోవడం గమనార్హం.

మల్టీ జోన్​–1 పరిధిలో పని చేస్తున్న పలువురు సీఐలను జూన్​ 23న ట్రాన్స్​ఫర్​ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 మందికి స్థానచలనం కల్పించారు.

- Advertisement -

వెయింటింగ్​లో ఉన్న సీఐ నల్లమోతు చిట్టిబాబును (CI Nallamothu Chittibabu) ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. అక్కడ పని చేస్తున్న తుమ్మలపల్లి శ్రీహరిని (Tummalapalli Srihari) సత్తుపల్లికి బదిలీ చేశారు.

రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్​లో విధులు నిర్వహిస్తున్న కన్నం కుమారస్వామిని మధిరకు, కామారెడ్డి సీఎస్​బీలో పనిచేస్తున్న తిరుపయ్యను బాన్సువాడ రూరల్​కు పంపించారు. వెయిటింగ్​లో ఉన్న ఆర్ బన్సీలాల్​ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూర్ సర్కిల్​కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తుపల్లి సీఐగా పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, మధిర సీఐ దొంగరి మధు, బాన్సువాడ సీఐ తోకల రాజేష్​ను హైదరాబాద్​లోని మల్టీజోన్-1 ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News