ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy district | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి దుర్మరణం.. మరొకరి పరిస్థితి...

    Kamareddy district | రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Kamareddy district : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్​గల్ మండలంలోని జగన్నాథ పల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి(జులై 2) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండలం(Jukkal mandal)లోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్ పై తమ గ్రామానికి వెళ్తుండగా జగన్నాథపల్లి గేటు సమీపంలో రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనాస్థలిలోనే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

    Kamareddy district : పంక్చర్​ కావడంతో..

    పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి(Banswada Government Hospital)కి తరలించారు. టైర్​ పంక్చర్​ కావడంతో లారీని డ్రైవరు రోడ్డుపై ఆపినట్లు చెబుతున్నారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...