ePaper
More
    Homeతెలంగాణpashamylaram | పాశమైలారం పేలుడు ఘటనపై కమిటీ ఏర్పాటు

    pashamylaram | పాశమైలారం పేలుడు ఘటనపై కమిటీ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : pashamylaram | సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం (pashamylaram)లోని సిగాచి ఫ్యాక్టరీలో ఇటీవల పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. మరో 33 మంది గాయపడినట్లు సిగాచి పరిశ్రమ (Sigachi Factory) యాజమాన్యం తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. క్షతగాత్రులకు వైద్య సాయంతో పాటు మృతులకు కంపెనీ నుంచి బీమా క్లెయిమ్​ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

    పాశమైలారం ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మంత్రులు వివేక్​, దామోదర రాజనర్సింహ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తాజాగా ఈ ప్రమాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

    pashamylaram | సమగ్ర దర్యాప్తు కోసం..

    సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఏమిరేట్ సైంటిస్ట్ బి వెంకటేశ్వర్ ఈ కమిటీకి ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు. సీఎస్​ఐఆర్​ చీఫ్​ సైంటిస్ట్​ ప్రతాప్ కుమార్, రిటైర్డ్​ సైంటిస్ట్​ సూర్యనారాయణ, పూణే సీఐఎస్​ఆర్​ సేఫ్టీ ఆఫీసర్​ సంతోష్ సభ్యులుగా కమిటీ వేసింది. ప్రమాదంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...