ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Cordelia Cruise | అలలపై తేలియాడే అద్భుత ప్రపంచం.. విశాఖకు చేరుకున్న కార్డేలియా విహార నౌక

    Cordelia Cruise | అలలపై తేలియాడే అద్భుత ప్రపంచం.. విశాఖకు చేరుకున్న కార్డేలియా విహార నౌక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cordelia Cruise | సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తే అలలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. దీంతో తీర ప్రాంతాల్లోని బీచ్​లలో నిత్యం పర్యాటకుల సందడి నెలకొని ఉంటుంది. పర్యాటకుల కోసం బీచ్​ ఒడ్డున ఎన్నో ఫైవ్​ స్టార్​ హోటళ్లు వెలిశాయి. అయితే ఫైవ్​ స్టార్​ హోటల్(Five Star Hotel)​ సముద్రంలో తేలుతూ ఉంటే ఎలా ఉంటుంది. అదే కార్డేలియా విహార నౌక.. ఫైవ్​ స్టార్​ హోటల్​ వసతులతో ఈ క్రూయిజ్​లో అలలపై ప్రయాణించవచ్చు.

    సముద్రంలో షిప్​లో ప్రయాణిస్తే ఆ అనుభవం వేరు. ఎంతో మంది షిప్​లో ప్రయాణించాలని అనుకుంటారు. వీరి కోసం కార్డేలియా విహార నౌక(Cordelia Cruise Ship) అందుబాటులోకి వచ్చింది. ఫైవ్​ స్టార్​ వసతులతో బయట ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రశాంతంగా ఈ నౌకలో ప్రయాణించవచ్చు.

    Cordelia Cruise | టూరిజం కేంద్రంగా..

    రానున్న రోజుల్లో పర్యాటక రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు టూరిజం డెవలప్​మెంట్(Tourism Development)​పై చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నాన్ని అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చాలని సంకల్పించింది. ఇటీవల విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.80 కోట్లతో నిర్మించిన ఈ టెర్మినల్​ను ఇటీవల కేంద్ర మంత్రి ప్రారంభించారు. తాజాగా ఈ టెర్మినల్​లోకి అంతర్జాతీయ పర్యాటక నౌక కార్డేలియా వచ్చింది.

    Cordelia Cruise | 1100 మంది పర్యాటకులతో..

    కార్డేలియా క్రూయిజ్​ సంస్థ కార్డేలియా విహార నౌకను నడుపుతోంది. ఇది చెన్నై– విశాఖపట్నం– పుదుచ్చేరి– చెన్నై మధ్య నడుస్తోంది. చెన్నై నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఈ నౌక బుధవారం ఉదయం విశాఖ(Visakhapatnam) తీరానికి చేరుకుంది. ఇందులో 796 క్యాబిన్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1800 మంది పర్యాటకులు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే తొలి ట్రిప్​లో 1100 మందితో విశాఖ చేరుకుంది.

    Cordelia Cruise | గతంలోనే ప్రారంభం

    వైసీపీ హయాంలో 2022లో కార్డేలియా నౌక విశాఖ తీరానికి వచ్చింది. అప్పుడు కూడా చెన్నై–విశాఖ–పుదుచ్చేరి మీదుగా ఈ విహార నౌకను నడిపారు. అప్పుడు జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు ఈ నౌక పర్యాటకుల కోసం అందుబాటులో ఉంది. తాజాగా జూన్​ 30 మళ్లీ చెన్నై నుంచి క్రూయిజ్​ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జులై 2న విశాఖ చేరుకుంది. మళ్లీ ఈ నెల 9, 16 తేదీల్లో ఈ నౌక విశాఖ తీరానికి చేరుకోనుంది. చెన్నై-విశాఖ- పుదుచ్చేరి-చెన్నై మధ్య మూడు సర్వీసులు ఈ నెలలో నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. జూన్‌ 30న చెన్నై నుంచి బయలు దేరిన షిప్​ జులై 2న విశాఖ టెర్మినల్‌(Visakhapatnam Terminal)కు చేరుకుంది. సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి 4న పుదుచ్చేరికి వెళ్తుంది. అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5న చెన్నైకి చేరడంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...