అక్షరటుడే, అమరావతి : Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy CM Pawan Kalyan)కు తమిళనాడు Tamil Nadu పోలీసులు షాక్ ఇచ్చారు. అక్కడి అన్నానగర్ పోలీస్ స్టేషన్ లో పవన్ పై కేసు నమోదు చేశారు. గత నెల(జూన్ 22)లో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న పవన్ ఉద్వేగ పూరిత ప్రసంగంతో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) మురుగన్ భక్తుల సదస్సు(Murugan devotees’ conference)లో ద్వేషపూరిత ప్రసంగం చేశారనేది అభియోగం. దీనిపై అన్నామలై తో పాటు అనేక మంది నిర్వాహకులపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Pawan Kalyan : పలు సెక్షన్ల కింద..
పవన్ కళ్యాణ్పై మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2)లను కేసులో తమిళనాడు పోలీసులు పొందుపర్చారు.
మురుగన్ భక్తుల సదస్సులో చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. జాతి, మతం, ప్రాంత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేవిగా, సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పొందుపర్చినట్లు తెలుస్తోంది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఓసారి పరిశీలిస్తే…
ఈ సదస్సులో హిందువులు ఒక కూటమిగా ఓటు వేయాలని కోరారు. ఆలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొన్ని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై పవన్ ప్రసంగిస్తూ… హిందువుల్ని నిలదేసే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాల్ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని అన్నారు. మురుగన్ భక్తులు ఒక్కచూపు చూస్తే చాలు.. తమ దేవుడిని దూషించే కూటమి కంటికి కనిపించకుండా పోతుందన్నారు. సహజంగా నాస్తికులు భగవంతుడిని నమ్మరని గుర్తుచేశారు. కానీ, కొందరు మాత్రం హిందూ దేవుళ్లనే నమ్మమంటున్నారని వ్యాఖ్యానించారు. హిందూధర్మాన్ని తప్పితే ఇతర వాటిని నిలదీసే ధైర్యం వారికి లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.