ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | పాదయాత్రపై వైఎస్​ జగన్​ కీలక ప్రకటన

    YS Jagan | పాదయాత్రపై వైఎస్​ జగన్​ కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, అమరావతి : YS Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో తన పాదయాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YSR Congress Party chief, former CM YS Jagan) కీలక ప్రకటన చేశారు. తాడేపల్లి(Tadepalli)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు(జులై 1) జరిగిన యువ విభాగ సమావేశంలో తన పాదయాత్రపై స్పష్టత ఇచ్చారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని జగన్​ తెలిపారు. తర్వాత పాదయాత్ర ఉంటుందన్నారు.

    YS Jagan : పార్టీ పెట్టిన కొత్తలో…

    పార్టీ పెట్టిన కొత్తలో అందరూ కొత్తవాళ్లేనని జగన్​ గుర్తుచేసుకున్నారు. మొదట తనతో పాటు అమ్మ మాత్రమే ఉన్నట్లు గుర్తుచేశారు. తనపై అభిమానం ఉన్నవాళ్లు పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రస్థానం ఎక్కడ మొదలైందో.. ఎదురైన కష్టాలను ప్రస్తావించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజీ పడలేదన్నారు.

    YS Jagan : రాజకీయాల్లో అది అత్యంత ముఖ్యమైనది..

    ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని జగన్​ అన్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగానికి దిశానిర్దేశం చేశారు. యూత్ వింగ్ అనేది పార్టీలో అత్యంత క్రియాశీలకమైనదన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. నాయకులుగా ఎదిగేందుకు ఇది గొప్ప అవకాశమని జగన్​ పేర్కొన్నారు.

    YS Jagan : ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ

    ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ తనకు వచ్చిందని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆ ఫలితాలు ప్రతి పార్లమెంటు సభ్యుడిని మనవైపు చూసేలా చేసిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక కొందరు తమ మీద పగబట్టారన్నారు. 18 మంది శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా చేశామన్నారు. కానీ, ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసే పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికష్టాలు వచ్చినా, విశ్వసనీయత, విలువలకు పెద్దపీట వేసినట్లు జగన్​ చెప్పుకొచ్చారు.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...