ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKharge Meeting | ఖర్గే సభకు తరలిరావాలి.. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్

    Kharge Meeting | ఖర్గే సభకు తరలిరావాలి.. డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kharge Meeting | హైదరాబాద్​లో ఈ నెల 4న నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున​ ఖర్గే (AICC President Mallikarjun Kharge) సభకు జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు (DCC President Kailas Srinivas Rao) పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ అనుబంధ సంస్థల నాయకులతో ఎల్​బీ స్టేడియంలో (LB Stadium) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని, ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 600 మంది పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, రాజాగౌడ్, గంగాధర్, కిరణ్ కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...