Swami Brahmananda Saraswati | కల్మషం లేకుండా జీవించాలి
Swami Brahmananda Saraswati | కల్మషం లేకుండా జీవించాలి

అక్షరటుడే, కామారెడ్డి:Swami Brahmananda Saraswati | మానవులు ఎలాంటి కల్మషం లేకుండా జీవించాలని ఆర్ష గురుకుల ఆచార్యులు స్వామి బ్రహ్మానంద సరస్వతి అన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో ఉన్న ఆర్ష గురుకులం స్వర్ణోత్సవ(Golden Jubilee) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలో అష్టోత్తర(108) శతకుండీయ మహాయజ్ఞం(Shatakundiya Mahayagnam) నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మానంద సరస్వతి(Swami Brahmananda Saraswati) మాట్లాడుతూ.. మానవులందరూ కలిసి జీవించాలన్నారు. కలిసి జీవించకుంటే దుఃఖాలు ఎదురవుతాయని వివరించారు. మనసులో కల్మషం పెట్టుకుంటే మనుషులు దూరం అవుతారన్నారు. కార్యక్రమంలో కంకణాల కిషన్, మాఘం కృష్ణమూర్తి, ఆష్​తోష్​ స్వామి, హరికిషన్ వేదాలంకారం, పండిత్ హరిదాస్ ఆర్య, ఆచార్య వేదమిత్ర, భక్తులు పాల్గొన్నారు.