ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు ఊపందుకుకున్నాయి. ఈ క్రమంలో రైతులు యూరియా (Urea), ఇతర ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే పలు చోట్ల యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

    బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ (Mupkal) మండలం రెంజర్ల గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు, మహిళలు భారీగా వచ్చారు. అయితే క్యూలైన్​లో చెప్పులు పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు. ఈ విషయంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prahsnth Reddy) ఎక్స్​ వేదికగా స్పందించారు. రేవంత్​రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

    రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రైతులకు గత కాంగ్రెస్ పాలనలోని పాత రోజులు వచ్చాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల కోసం రైతులు ఏనాడు ఇబ్బందులు పడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

    More like this

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...