ePaper
More
    Homeజాతీయంelectric vehicle | అధిక మైలేజీ పేరుతో మోసం.. నియాన్‌ మోటార్స్, మహీంద్రాకు భారీ జరిమానా

    electric vehicle | అధిక మైలేజీ పేరుతో మోసం.. నియాన్‌ మోటార్స్, మహీంద్రాకు భారీ జరిమానా

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: electric vehicle : మైలేజీ విషయంలో వినియోగదారుడిని మహీంద్రా అండ్‌ మహీంద్రా, నియాన్‌ మోటార్స్​ సంస్థలు మభ్య పెట్టినట్లు నిర్ధారించిన హైదరాబాద్‌ కమిషన్‌-2.. ఆ సంస్థలకు భారీగా జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడి మానసిక వేదనను పరిగణనలోకి తీసుకొని రూ.5 లక్షల పరిహారం, రూ.10 వేలు కేసు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడిన 45 రోజుల్లో మొత్తం చెల్లించాలని, లేకుంటే 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

    జీహెచ్​ఎంసీ పరిధిలోని బల్కంపేటకు చెందిన చెన్నంశెట్టి సతీశ్​ కుమార్‌ తాడ్‌బండ్‌లోని నియాన్‌ మోటార్స్‌లో మార్చి, 2023లో ఎక్స్‌యూవీ – 400 విద్యుత్తు వెహికల్​ను రూ.19,63,306కు కొనుగోలు చేశారు. సంప్రదింపుల సమయంలో 100 శాతం ఛార్జింగ్‌తో 456 కిలోమీటర్లు, 80 శాతంతో 364 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీవారు చెప్పారు. కానీ, 240 కిలోమీటర్లకు మించి మైలేజీ రాకపోవడంతో నియాన్‌ మోటార్స్, తయారీ సంస్థల ప్రతినిధులను సతీశ్​ కుమార్‌ సంప్రదించారు.

    కారును లోటు పాట్ల పరిశీలన నిమిత్తం సర్వీసింగ్‌ సెంటర్‌కు పంపినా.. మైలేజీ పెరగలేదు. దీంతో ఎక్స్‌ఛేంజ్‌లో మరో వాహనాన్ని ఇవ్వాలని సతీశ్​ కుమార్‌ అభ్యర్థిస్తే వారు పట్టించుకోలేదు. ఆవేదన చెందిన సతీశ్​ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ప్రతివాద సంస్థలు ఫిర్యాదు దారుడి ఆరోపణలను ఖండించాయి. కమిషన్​ ఆదేశాల మేరకు కారు మైలేజీ విషయంలో సంయుక్త అధ్యయనం చేస్తే.. టెస్ట్‌ డ్రైవ్‌లో 11 శాతం బ్యాటరీ ఖర్చుతో 23.7 కి.మీ.గా వచ్చింది. దీంతో ప్రతివాద సంస్థలకు హైదరాబాద్‌ కమిషన్‌-2 భారీ జరిమానా విధించింది.

    Latest articles

    Harish Rao | యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాలు.. రైతుల ఉసురు తగులుతుందని హరీశ్ రావు ధ్వజం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరిగోస...

    Tamil Nadu | గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా వద్దు..ఆయ‌న చేతుల మీదుగా తీసుకుంటాన‌న్న‌పీహెచ్‌డీ స్కాల‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu | తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో (MSU) బుధవారం జరిగిన 32వ...

    Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి..

    అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​...

    Andhra Pradesh | ఏపీ నూతన జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు .. వారి నుంచి సూచనలు స్వీకరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది....

    More like this

    Harish Rao | యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాలు.. రైతుల ఉసురు తగులుతుందని హరీశ్ రావు ధ్వజం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరిగోస...

    Tamil Nadu | గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా వద్దు..ఆయ‌న చేతుల మీదుగా తీసుకుంటాన‌న్న‌పీహెచ్‌డీ స్కాల‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu | తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో (MSU) బుధవారం జరిగిన 32వ...

    Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి..

    అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​...