ePaper
More
    HomeజాతీయంPrashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(Chief Minister Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఓ టీవీ ఛానెల్​లో మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) ముందు అప్పటి సీఎం కేసీఆర్​పై రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో భాగంగా పలు విషయాల్లో ఆయనను విమర్శించారు. అయితే ఆ సమయంలో కేసీఆర్​ కీలకమైన బాధ్యతల్లో బీహార్​కు చెందిన ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులను నియమించారు. దీనిపై రేవంత్​రెడ్డి బీహారీ బ్యాచ్(Bihari Batch)​ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు రేవంత్​ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అంతేగాకుండా కేసీఆర్​ డీఎన్​ఏ బీహర్​ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రశాంత్​ కిశోర్(Prashant Kishore)​ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

    Prashanth Kishor | రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలి

    కాంగ్రెస్​ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీహారీలపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్​ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ కిశోర్​ డిమాండ్​ చేశారు. ఈ ఏడాది అక్టోబర్​, నవంబర్​లో బీహార్​లో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాగైన పట్టు సాధించాలని జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం నితీశ్​కుమార్​(CM Nitish Kumar) తీరుపై పలు ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు. బిహార్‌ గ్రామంలో ఓ రాత్రి అయినా గడపాలని..రాహుల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ సవాల్​ విసిరారు. బిహార్ ప్రజలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఖండించిన పీకే.. ఆ వ్యాఖ్యలకు రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. తర్వాతే ఆయన బీహార్​లో అడుగు పెట్టాలన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...