ePaper
More
    Homeక్రైంHyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

    Hyderabad | పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగర శివారులోని దుండిగల్​ విషాదం చోటు చేసుకుంది. తల్లితో కలిసి స్కూటీపై బడికి వెళ్తున్న బాలుడు టిప్పర్(Tipper)​ కింద పడి చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​ పోలీస్​ స్టేషన్​(Dundigal Police Station) పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.

    ఓ తల్లి ఒకటో తరగతి చదువుతున్న తన కుమారుడిని బడిలో దింపడానికి స్కూటీపై బయలు దేరింది. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో గల పల్లవి అంతర్జాతీయ పాఠశాల(International School) ఎదుట స్కూటీని టిప్పర్​ ఢీకొంది. దీంతో బాలుడు టిప్పర్​ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి దూరంగా పడడంతో గాయాలతో బయట పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...