ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్​ బైక్(Electric Bike)​ పేలి ఓ మహిళ మృతి చెందింది. ఇంధన దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు, కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్​ బైక్​లు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రంగ రవాణా సంస్థలు కూడా ఎలక్ట్రిక్​ బస్సులను(Electric Buses) కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్​ బైక్​లు పేలిపోతుండటంతో వాటిని కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.

    కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం(Potladurthi village)లో ఎలక్ట్రిక్​ బైక్​ పేలిపోయింది. బైక్​కు ఛార్జింగ్​ పెట్టి పడుకున్నారు. అయితే రాత్రి పూట ఒక్కసారిగా అది పేలిపోయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళా మృతి చెందింది. దీంతో ఎలక్ట్రిక్​ బైక్​లు వినియోగించే వారు ఆందోళన చెందుతున్నారు. కాగా గతంలో సైతం పలు చోట్ల ఎలక్ట్రిక్​ బైక్​లు దగ్ధమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యుత్​ వాహనాల భద్రతపై ఆందోళన నెలకొంది.

    More like this

    Mohan Bhagwat | భారత్ అంటే భయపడే సుంకాలు.. అమెరికా తీరును ఎండగట్టని మోహన్ భగవత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat | భారతదేశం బలంగా అభివృద్ధి చెందితే తమకు ఏమి జరుగుతుందోనని అమెరికాకు...

    Stock Market | ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ పైపైకి.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....

    Collector Nizamabad | సెంట్రల్ డ్రగ్స్ స్టోర్​ను తనిఖీ చేసిన కలెక్టర్

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్​లో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ స్టోర్​ను (Central Drugs...